Friday, September 27, 2024

కెటిఆర్‌కు సృజన్‌రెడ్డి లీగల్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్‌కు సూదిని సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం శోభ కన్‌స్ట్రక్షన్‌కు ఇచ్చిన అమృత్ పథకం టెండర్లలో అవినీతి జరిగిందని చేసిన ఆరోపణలపై ఈ నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. కాగా కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ వెంటనే విచారణ చేపట్టి నిజాలను బహిర్గతం చేయాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ కట్టర్, టోచన్ సాహ్లూకు గత శుక్రవారం లేఖలు రాశారు.

కేంద్రం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.1500 కోట్ల టెండర్లు సిఎం సొంత బావమరిది సృజన్ రెడ్డికి చెందిన శోభ కన్‌స్ట్రక్షన్‌కు అర్హతలు లేకున్నా కట్టబెట్టారని వెంటనే ఈ ఆరోపణ లపై కేంద్రం విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని కోరారు. కాగా ఈ ఆరోపణలపై సృజన్ రెడ్డి కేటీఆర్‌కు లీగల్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా, వెబ్ సైట్ నుండి కంటెంట్ తొలిగించాలని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని సృజన్ రెడ్డి కెటిఆర్‌కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొ న్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News