Friday, September 27, 2024

తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం..

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది.

ఇక, గురువారం శ్రీవారిని 61,328 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి 22,033 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.84కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. కాగా, రేపటి నుండి 30వ తేదీ వ‌రకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News