Sunday, September 29, 2024

సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కలెక్టరేట్ ఒక్క సారిగా ఉలిక్కిపడింది. కార్యాలయం సాక్షిగా ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపింది. విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ తన రివాల్వర్‌తో తననే కాల్చుకొని రక్తపు మడుగులో ప్రాణాలొదిలిన ఉదంతం సంచలనం రేపింది. ఈఘటనకు సంబందించి ఇబ్రహీంపట్నం ఏసిపి రాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మంచాల మండలకేంద్రానికి చెందిన దూసరి బాలకృష్ణ (28) రాచకొండ కమీషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

గత కొంతకాలంగా కొంగరకలాన్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గార్డ్‌గా కొనసాగుతున్నాడు. ఈక్రమంలో శనివారం తెల్లవారుఝామున 4గం.ల సమయంలో తన రివాల్వర్ తనపైనే గురిపెట్టి కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు తెలిపారు. మృతుడి వద్ద ఓ సూసైడ్ నోట్ లభ్యమైనట్లు ఏసిపి తెలిపారు. కాగా మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News