Monday, September 30, 2024

మహారాణి రుక్మిణీదేవిగా అందాలు ఒలకబోస్తూ..

- Advertisement -
- Advertisement -

అందం, ప్రతిభ గల అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్స్‌లో ఒకరు రీతు వర్మ. పెళ్లి చూపులు, టక్ జగదీశ్, వరుడు కావలెను, కనులు కనులను దోచాయంటే వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతు వర్మ. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు క్రేజీ ప్రాజెకట్స్ చేస్తోంది ఆమె. ఇప్పుడు ఆమె అప్ కమింగ్ రిలీజ్ స్వాగ్‌తో మరోసారి ప్రేక్షకుల్ని అలరించబోతోంది. స్వాగ్ సినిమాలో వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి పాత్రలో రీతు వర్మ కనిపించనుంది. మహారాణి రుక్మిణీదేవి పాత్రతో ఆమె అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. స్వాగ్‌లో ఆమె క్యారెక్టర్ హైలైట్ కానుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేసేందుకు ఇష్టపడే రీతు వర్మ. మహారాణి రుక్మిణీదేవి పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్దమైంది. ఆమె ఎఫర్ట్ స్క్రీన్ మీద కనిపించబోతోంది. శ్రీవిష్ణు హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో దర్శకుడు హసిత్ గోలి రూపొందించిన స్వాగ్ మూవీ అక్టోబర్ 4న థియేటర్స్‌లోకి రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News