Tuesday, October 1, 2024

మూసీ ప్రాజెక్టు పేరుతో అతిపెద్ద కుంభకోణం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీలు..చేసిన వాగ్ధానాలు ఏమిటి..అసలు అధికారంలోకి వచ్చాక చేస్తున్నది ఏంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘గత వారం పదిరోజులుగా హైదరాబాద్ మహానగరం, రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో సూర్యాపేట, ఆదిలాబాద్, సంగారెడ్డి ఇతర కొన్ని పట్టణాల్లో చాలాచోట్ల ప్రభుత్వం దుందుడుకు వైఖరి వల్ల చాలామంది పేదలు తమ పార్టీ నాయకత్వాన్ని కలిసి పెద్దలు కేసీఆర్‌ను తలచుకుంటూ ఒకటేమాట చెబుతున్నారు. ఎన్నో ఆశలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ రకమైన అన్యాయం మరొకసారి కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మేం ఊహించలేదన్నారు. ఏ ఇందిరమ్మ చెప్పింది? ఏ సోనియమ్మ చెప్పింది పేదల కొంపలు కూల్చి పెద్దలకు లాభం చేయమని రేవంత్‌రెడ్డికి అని ప్రశ్నించారు. తెలంగాణలోని పేద తల్లులందరూ తమ నాయకత్వం వద్దకు వచ్చి మొరపెట్టుకుంటున్నారన్నారు.

హైకోర్టుకు ధన్యవాదాలు : ‘రాష్ట్రంలోని పేదల తరపున హృదయపూర్వకంగా తెలంగాణ హైకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ బుల్డోజర్ రాజ్యాన్ని, బుల్డోజర్ నిర్వాకాన్ని, హైడ్రా కమిషనర్‌ను మందలించి మీరు చట్టపరంగాపోవాలి తప్ప ఇష్టానుసారంగా వెళ్తే ఊరుకోం. అవసరమైతే స్టే విధించాల్సి వస్తుందని చెప్పినందుకు రాష్ట్రంలోని పేదలపక్షాన గౌరవ హైకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. తమ లీగల్ సెల్ సైతం పేదలకు అండగా నిలబడిందని, లంచ్ మోషన్స్ సైతం మూవ్ చేశారన్నారు. వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాని, క్షేత్రస్థాయిలో జగదీశ్‌రెడ్డి, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, మహమూద్ అలీ, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, కార్తీక్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ చాలామంది మిత్రులు తిరిగి ప్రజల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారని, వారికి కూడా అభినందలని తెలిపారు.

ఏం ఆశించి మూసి ప్రాజెక్టు చేపట్టారు : ఈ మూసీ ప్రాజెక్టు ఎవరి కోసం చేస్తున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మీ ప్రాధాన్యాలు ఏంటీ? మీరు ఇచ్చిన వాగ్ధానాలు ఏంటి..మీరు ఏం చెప్పారు. వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఫుల్‌పేజీ యాడ్స్ ఇచ్చారని గుర్తు చేశారు. ‘వందరోజులు వందరోజులు అని చెప్పి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రూ.2వేల పెన్షన్ రూ.4వేలు అవుతుందని, మహిళలందరికీ రూ.2500 చొప్పున ఇస్తామని, కల్యాణలక్ష్మిలో రూ.లక్షకు అఅదనంగా తులం బంగారం ఇస్తామని, మొదటి రోజే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని.. రైతుబంధును రూ.15వేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి 300 రోజులు దాటింది. వందరోజుల్లో చేస్తామని చెప్పిన ఒకమాట చేయకపోగా 300 రోజులు దాటినా ఎప్పుడు చేస్తారో స్పష్టత ఇవ్వకుండా ఇవాళ అక్కరలేని, ప్రజలు కోరుకోని కాస్మోటిక్ ఎన్‌హాన్స్‌మెంట్ కోసం రూ.1.50లక్షలకోట్లు ఖర్చుపెడుతామంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎవరైనా మున్సిపల్ శాఖ చూస్తున్నారో ఆయనను సూటిగా అడుగుతున్నానన్నారు. మీరు ఏం ఆశించి ఏ చేస్తున్నారు ఈ ప్రాజెక్టు చెప్పాలి. ఓ వైపు ఖజానాలో పైసలు లేవు..లంకెబిందెలు లేవని మీరే చెబుతారు. అప్పులు కట్టేందుకే అప్పులు చేయాల్సి వస్తుందని ఉప ముఖ్యమంత్రి చెబుతున్నారని, ఇంత వరకు కనీసం ఇచ్చిన హామీ సవ్యంగా నెరవేర్చలేదన్నారు. రుణమాఫీ అన్నారు.. దేవుళ్లపై ఒట్లు పెట్టారు. పంద్రాగస్టు అన్నారు.. డిసెంబర్ అన్నారు అది పూర్తి చేయలేదు. ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు. 420 హామీలు ఉన్నాయ్. ఇప్పటి వరకు ఒక్కటి అమలు చేసిన పాపాన పోలేదని, ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు.

మొదట హైడ్రా కార్యాలయాన్నే కూల్చాలి : మూసీ పరివాహకంలో కూల్చివేతలు చేస్తే మొదట హైడ్రా కార్యాలయాన్ని కూల్చాలని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ పేర్కొన్నారు. మూసీ నది సుందరీకరణతో రాష్ట్రానికి ఎంత ఆదాయం తిరిగి వస్తుందని అడిగారు. మూసీ పరివాహక ప్రజల పాలిట సీఎం కాలయముడిగా మారారని ఆరోపించారు. మూసీ పరివాహక ప్రజల పాలిట సీఎం రేవంత్ రెడ్డి కాలయముడిగా మారారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మాకు పట్టాలు వచ్చాయని ప్రజలు చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు చెప్తున్నారని పేదలు అడుగుతున్నారని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇల్లు అనేది ప్రజలకు ఉద్వేగంతో కూడిన అనుబంధం అని కేటీఆర్ తెలిపారు. అన్ని అనుమతులు తీసుకుని కట్టుకున్న ఇళ్లను ఎలా కూల్చుతారని ప్రశ్నించారు. ప్రభుత్వమే గుర్తించిన ఇళ్లను ఎందుకు కూల్చుతున్నారని గట్టిగా అడిగారు. గతంలో 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చెరువులకు హద్దులు ఎందుకు గుర్తించలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదన్నారు. ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రాధాన్యతలు ఉన్నాయా? కేవలం మూసీ పైనే రూ.1.50 లక్షల కోట్లు కేటాయిస్తారా? అని కేటీఆర్ పేర్కొన్నారు.

బుద్ధభవన్ కూల్చుతారా : 2400 కిలోమీటర్లు ఉన్న గంగా నది కోసం కేవలం రూ.40 వేల కోట్లు కేటాయించారని కేటీఆర్ అడిగారు. కూల్చాల్సి వస్తే మొదట హైడ్రా కమిషనర్ కార్యాలయం కూల్చాలని సూచించారు. ఎఫ్‌టీఎల్‌లోనే నిర్మించిన బుద్ధభవన్‌ను కూడా కూల్చాలన్నారు. ఎఫ్‌టీఎల్‌లోనే నిర్మించిన జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం సైతం కూల్చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం. మూసీ సుందరీకరణతో రాష్ట్రానికి ఎంత ఆదాయం తిరిగి వస్తుందని ప్రశ్నించారు. రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తే ఎన్ని ఎకరాలకు నీరు అందుతుంది. ఎవరి కమీషన్లు కోసం మూసీ సుందరీకరణ అంటున్నారు. పింఛన్లను రూ.4 వేలకు ఇంకా ఎందుకు పెంచటం లేదు. ఇళ్లు కట్టిస్తామన్నారు కానీ కూల్చుతామని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు కదా. ప్రజలు తిరగబడితే మంత్రులు ఊళ్లల్లో కూడా తిరగలేరు. పేద ప్రజల ఇళ్లు కూల్చుతుంటే మేము చూస్తూ ఊరుకోం. ఇకపై బుల్డోజర్లకు అడ్డుగా బీఆర్‌ఎస్ నేతలు ఉంటారని కేటీఆర్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News