Wednesday, October 2, 2024

రూ.416 కోట్లు రాష్ట్రానికి కేంద్రం వరద సాయం

- Advertisement -
- Advertisement -

14 వరద ప్రభావిత రాష్ట్రాలకు
రూ.5,858 కోట్లు విడుదల
అత్యధికంగా మహారాష్ట్రకు
రూ.1492 కోట్లు, ఎపికి
రూ.1036 కోట్లు రిలీజ్
గుజరాత్‌కు రూ.600 కోట్లు
కేటాయింపు మోడీ, షాలకు
కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం విపత్తు నిధులు వి డుదల చేసింది. బాధిత రాష్ట్రాలకు రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎస్‌డిఆర్‌ఎఫ్), జాతీయ విపత్తు స్పందన నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్) నుంచి అడ్వాన్స్ గా రూ. 5858.60 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు హోంశాఖ మంగళవారం ఒక ప్రకటన చేసింది. వరదలతో ఇటీవల అతలాకుతలమైన తెలంగాణ రాష్ట్రానికి రూ. 416.80కోట్లు మంజూరు చేసింది. అత్యధికంగా మహారాష్ట్రకు రూ. 1492 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్‌కు రూ. 10 36 కోట్లు, అస్సాంకురూ. 716 కోట్లు, బీహార్ కు రూ. 655.60కోట్లు, గుజరాత్‌కు రూ. 600 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ. 468 కోట్లు విడుదల చేసినట్లు ఒక అధికార ప్రకటన తెలియజేసింది.

హిమాచల్ ప్రదేశ్(రూ.189.20కోట్లు), కేరళ(రూ.145.60కోట్లు), మణిపూర్(రూ.50కోట్లు), త్రిపుర(రూ.25కోట్లు), సిక్కిం (రూ.23.6 0కోట్లు), మిజోరామ్ (రూ.21.60కోట్లు), నాగాలాండ్(రూ.19.2 0కోట్లు) రాష్ట్రాలకు కూడా కేంద్రం నిధులు విడుదల చేసింది. నైరుతి రుతుపవనాల సమయంలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల వల్ల ఆ రాష్ట్రాలు నష్టపోయాయి. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో మోడీ ప్రభుత్వం ప్రజల ఇక్కట్లు తీర్చేందుకు ప్రకృతి వైపరీత్యాల బాధిత రాష్ట్రాలతో భుజం భుజం కలిపి సాగుతోందని ఆ ప్రకటన పేర్కొన్నది.

మోడీ, అమిత్‌షాలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించడం పట్ల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలకు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం కిషన్‌రెడ్డి ఈ మేరకు ట్వీట్ చేశారు. వరదల కారణంగా నష్టం జరిగిన 14 రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం నిధులు విడుదల చేసిందని తెలిపారు. మొత్తం రూ.5,858 కోట్లు విడుదల కాగా దానిలో ఏపీకి రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416.80 కోట్లు విడుదల చేయడం పట్ల కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైన రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం కోసం తెలంగాణ రాష్ట్రానికి రూ.416.80 కోట్లు విడుదల చేయడం హర్షణీయమని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు సకాలంలో నిధులు విడుదల చేయడం వల్ల పునరావాస ప్రయత్నాలను వేగవంతం చేయడంతో పాటు అవసరమైన సామగ్రి బాధిత వర్గాలకు వేగంగా చేరేలా చూస్తుందని కిషన్ రెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News