Wednesday, October 2, 2024

ఇద్దరు కూతుర్లతో తిరుమలకు పవన్

- Advertisement -
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తన ఇద్దరు కూతుర్లు ఆద్య, పొలెనా అంజని పవనోవాలతో కలిసి ఎపి డిప్యూటీ పవన్ కల్యాణ్ తిరుమలకు వెళ్ళారు. నిన్న అలిపిరి మెట్ల మార్గాన కాలిన నడకన పవన్ తిరుమలకు వెళ్లారు. తిరుమలలో శ్రీ వారి దర్శనానికి పవన్ కల్యాణ్ డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై ఆయన సంతకాలు చేశారు. అయితే, పవన్ చిన్న కుమార్తె పొలెనా అంజని.. మైనర్ అయినందున తండ్రిగా పవన్ ఆ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం తిరుమల-మహద్వారం గుండా ఇద్దరు కూతుర్లతో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News