Saturday, October 5, 2024

పాము కాటుతో మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

పాము కాటుతో మహిళ మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే స్థానికుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన మహిళ పత్రి లక్ష్మి గ్రామంలో రోజు వారి కూలికి వెళుతూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో గురువారం కూలి పనికి వెళ్లగా లక్ష్మిని పాము కాటు వేసింది. అది గమనించిన తోటి మహిళలు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. లక్ష్మికి కూతురు, భర్త ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News