Saturday, October 5, 2024

యువకుడిని చెట్టుకు కట్టేసి..యువతిపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

యువతి పై గుర్తు తెలియని యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనా మహారాష్ట్రలోని పూణెలో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం పూణె కు చెందిన యువతి తన స్నేహితుడితో కలిసి గురువారం అర్థరాత్రి బోప్ దేవ్ ఘర్ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ గుర్తు తెలియని ముగ్గురు యువకులు యువకుడి పై దాడి చేసి చెట్టుకు కట్టేశారు. అనంతరం యువతిపై సామూహిక అత్యాచారం చేసి అక్కడ నుంచి పరారయ్యారు. దీంతో ఆ జంట దగ్గరలోని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News