Saturday, October 5, 2024

మూసీ నది ప్రక్షాళన పేరిట పేదల జోలికొస్తే ప్రతిఘటిస్తాం: సిపిఐ(ఎం)

- Advertisement -
- Advertisement -

ఉప్పల్: మూసీ నది ప్రక్షాళన పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్ల జోలికొస్తే వారి తరఫున సిపిఐ(ఎం) ప్రతిఘటిస్తుందని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్. వీరయ్య, మాజీ ఎంఎల్సి చెరుపల్లి సీతారాములు హెచ్చరించారు. వారు రామంతపూర్ లోని కెసిఆర్ నగర్, బాలకృష్ణ నగర్, మూసీ పరివాహక కాలనీలలో సిపిఐ(ఎం) తరఫున పర్యటించారు. సంపన్న వ్యాపారుల లబ్ధి కోసం మూసీ సుందరీకణ పేరుతో పేదల ఇళ్లను కూలుస్తున్నారన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను నాశనం చేయడం తగదని చెరుపల్లి సీతారాముల అన్నారు. సిపిఐ(ఎం) మేడ్చల్ జిల్లా కార్యదర్శి సత్యం మాట్లాడుతూ పేద ప్రజత తరఫఉన సిపిఐ(ఎం) ఉద్యమిస్తుందని, అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆనగంటి వెంకటేశ్, ఎం.వినోద, చంద్రశేఖర్, అశోక్, జె.వెంకన్న, సృజన, సబిత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News