Saturday, October 5, 2024

మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున పరువు నష్టం పిటిషన్… విచారణ వాయిదా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖ మీద సినీనటుడు అక్కినేని నాగార్జునవేసిన పరువు నష్టం పిటిషన్ విచారణ వాయిదా పడిం ది. అక్కినేని కుటుంబ విషయాలను ప్రస్తావిస్తూ కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపిన సంగతి విదితమే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన హీరో నాగార్జున కొండా సురేఖ తక్షణమే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు. మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోవడంతో నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం పిటిషన్ వేశారు.

అయితే న్యాయమూర్తి సెలవులో ఉండటంతో పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. కాగా శనివారం లేదా సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమా చారం. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మీద విమర్శలు చేయబోయి, మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం మీద, సమంత-నాగచైతన్య విడాకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు గత రెండు రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేగిన సంగతి విదితమే. టాలీవుడ్‌లో ప్రతీ ఒక్కరూ ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని సురేఖ సమంతకు మాత్రమే సారీ చెప్పింది. కెటిఆర్, నాగార్జునలకు క్షమాపణలు చెప్పేది లేదని తేల్చి చెప్పింది. ఈ నేప థ్యంలో నాగార్జున మంత్రి కొండా సురేఖ మీద న్యాయ పోరాటనికి సన్నద్ధులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News