Saturday, October 5, 2024

రవాణా శాఖ ఆదాయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లానే టాప్

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ చంద్ర శేఖర్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రవాణాశాఖ అర్థవార్షిక ఆదాయంలో ఉమ్మడి రంగారెడ్డి జల్లాది 45 శాతం వాటా ఉందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ చంద్ర శేఖర్ గౌడ్ స్పష్టం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ప్రభుత్వానికి రూ.1,436 కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన వెల్లడించారు. శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల అధికారులతో డిసి కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

అనంతరం చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ రంగారెడ్ది జిల్లాలో రూ.802 కోట్లు, మేడ్చల్-మల్కాజిగిరిలో రూ.595 కోట్లు, వికారాబాద్ జిల్లాలో రూ.39 కోట్లు వచ్చిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అర్థవార్షిక ఆదాయ లక్ష్యం 1,792 కోట్లు కాగా, రూ.1,436 కోట్లు సాధించామని, 80 శాతం ఆదాయ లక్ష్యాన్ని చేరుకున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రానికి వచ్చిన రూ.3,195 కోట్ల ఆదాయంలో 45 శాతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాదేనని ఆయన తెలిపారు. త్రైమాసిక పన్నుల ద్వారా రూ.161 కోట్లు, జీవిత కాలపు పన్నుల ద్వారా రూ.1,120 కోట్లు, ఫీజుల ద్వారా రూ.92 కోట్లు, సర్వీస్ ఛార్జీల ద్వారా రూ.21 కోట్లు, గ్రీన్ టాక్స్ ద్వారా రూ.10 కోట్లు, తనిఖీల ద్వారా రూ.32 కోట్లు మొత్తం రూ.1,436 కోట్ల ఆదాయాన్ని సాధించినట్లు ఆయన వివరించారు.

త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనదారులు పన్నులు చెల్లించాలని లేని పక్షంలో తనిఖీల్లో పట్టుబడితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు. ఓవర్ లోడ్‌తో తిరిగే వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. 2024-, 25లో ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మూడు జిల్లాల రవాణా శాఖ అధికారులు సుభాష్ చందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కిరణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, సుశీల్ రెడ్డి, నవీన్, వాసు, కృష్ణవేణి, మున్ని, అనూష, ఉపాసిని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News