Saturday, October 5, 2024

40 మంది నక్సల్స్ మృతి…

- Advertisement -
- Advertisement -

మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు?

భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం, ఈ ఏడాది బస్తర్ ఏరియాలోనే 180మంది హతం

దంతెవాడ/మన తెలంగాణ/చర్ల: చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 40 మందికిపైగా నక్సల్స్ మరణించారు. నారాయణ్‌పూర్-దంతెవాడ అంతర్ జిల్లా స రిహద్దులోని అభూజ్‌మాడ్ అడవుల్లో మ ధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కా ల్పుల పోరు జరిగినట్లు పోలీసులు తెలిపారు. నక్సల్స్ ఏరివేత కోసం చేపట్టిన గాలింపు చర్యలలో భాగంగా భద్రతా ద ళాల సంయుక్త బృందం ఆ ప్రాంతానికి వెళ్లినట్లు వారు చెప్పారు. బృందంలో డి స్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు(డిఆర్‌జి), స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్‌టిఎఫ్)కు చెందిన సి బ్బంది పాల్గొన్నారు.

కాల్పుల పోరు అ నంతరం భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని గాలించగా  భారీ మొత్తంలో ఆయుధాలతోసహా 40 మంది నక్సల్స్ మృతదేహాలు లభించాయని వారు చెప్పారు. ఒక ఎకె 47 రైఫిల్, ఒక ఎస్‌ఎల్‌ఆర్(సెల్ఫ్ లోడింగ్ రైఫిల్)తోసహా పెద్ద మొత్తంలో ఆయుధాలు లభించినట్లు వారు చెప్పారు. ఆ ప్రాంతంలో భద్రతా దళాల గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. తాజా ఎన్‌కౌంటర్‌ను కలుపుకుంటే ఏ ఏడాదిలో దంతేవాడ, నారాయణ్‌పూర్‌తోసహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఒత్తం 187 మంది మావోయిస్టులు హతమయ్యారని పోలీసులు తెలిపారు. ఇదిలాఉంటే ఎన్‌కౌంటర్ మృతుల్లో పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News