Saturday, October 5, 2024

గ్రూప్-1పై తీర్పు రిజర్వ్

- Advertisement -
- Advertisement -

పరీక్షల రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్లపై
వాదనలు విన్న హైకోర్టు మెయిన్స్ పరీక్షలకు
సన్నద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఉత్కంఠ

మన తెలంగాణ/హైదరాబాద్: టిజిపిఎస్‌సి గ్రూప్1 పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరి గింది. అటు పరీక్షలను రద్దు చేయాలంటూ పిటిషన్లు దాఖలు చేసిన పిటిషనర్ల వాదనలతో పాటు టిజిపిఎస్‌సి వాదనలను కూడా సానుకూలంగా విన్న కోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గ్రూప్1లో తప్పుడు ప్ర శ్నలు వచ్చాయని, వాటిని తొలగించి, మెరిట్ జాబితా విడుదల చేయాలని పిటిషనర్లు కోర్టుకు తమ వాదన వినిపించగా, సబ్జెక్ట్ నిపుణుల క మిటీ పరిశీలన తర్వాతే కీ రూపొందించామని టిజిపిఎస్‌సి ధర్మాసనానికి వివరించింది. ఈ క్రమంలోనే తుది తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ధ ర్మాసనం వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈ నెల 21 నుంచి మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉండడంతో ఆ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

ఇదిలా ఉంటే గ్రూప్1 పరీక్షను రద్దు చేయాలని, ఎస్‌టి రిజర్వేషన్ల పెంపు చెల్లదని, తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలు విడుదల చేయాలని కోరుతూ ఇటీవల హైకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే టిజిపిఎస్‌సి తరపు న్యాయవాది ప్రిలిమి నరీ పరీక్షలపై వచ్చిన అభ్యంతరాలకు అర్థం లేనివని, పిటిషనర్‌లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా పిటిషన్‌లు దాఖలు చేశారని, ఏదో ఓ పుస్తకాన్ని ప్రామాణికంగా చేసుకుని పరీక్షల్లో ప్రశ్నలే తప్పనడం సమంజసం కాదని, 3 లక్షల మందిలో ఒకరిద్దరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, ఇది మెయిన్స్ కోసం సిద్ధమవుతున్న వారిని అయోమయానికి గురిచేసే చర్యని ఆక్షేపించారు. ఈ క్రమంలోనే తీర్పును శుక్రవారానికి వాయిదా వేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News