Sunday, October 6, 2024

గజ్వేల్ ఎంఎల్ఏ కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు?!

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: తమ ఎంఎల్ఏ కనిపించడం లేదని నియోజకవర్గ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారి శ్రీకాంత్ రావు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. మా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు మూడు సార్లు ఆయనను ఎంఎల్ఏ గా గెలిపించారు. ప్రతిపక్ష నాయకుని హోదా కల్పించారు. గత 10 నెలలుగా కలిసి బాధలు చెప్పుకుందామంటే కనిపించడం లేదని, వెతికినా జాడ దొరకడం లేదని  ఫిర్యాదులో పేర్కొన్నారు.

గజ్వేల్ ప్రజలు గంపెడాశతో మీ కోసం ఎదురు చూస్తున్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేరక సమస్యలు అట్లానే మిగిలిపోయాయి.  తమ ప్రాంత సమస్యలను శాసనసభలోనైనా నిలదీస్తారనుంకుంటే శాసన సభ ముఖం కూడా చూడ్డం లేదు. కనుక కెసిఆర్ ను వెతికి పట్టుకుని నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని గజ్వేల్ పోలీసులను బండారి శ్రీకాంత్ రావు  కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News