Monday, October 7, 2024

రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు..భద్రత కట్టుదిట్టం

- Advertisement -
- Advertisement -

రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రెండ్రోజుల క్రితమే ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో తిరుపతి విమానాశ్రయ సిఐఎస్‌ఎఫ్ క్రైం ఇంటెలిజెన్స్ విభాగం ఎస్‌ఐ నాగరాజు ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈమెయిల్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు, బాంబు బెదిరింపు నేపథ్యంలో విమానాశ్రయం లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. అక్టోబర్ 12 వరకు ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది. పురటాసి మాసం కూడా వస్తున్నందు వల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది. రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు, జిల్లాయంత్రాంగం సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని టిటిడి ఇఒ జె. శ్యామలరావు ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News