Monday, October 7, 2024

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024: బోణీ కొట్టిన భారత్

- Advertisement -
- Advertisement -

ప్రపంచకప్‌లో దాయాది జట్టుపై ఆరు వికెట్ల విజయం
సెమీస్ ఆశలు సజీవం
దుబాయి: యుఎఇ వేదికగా జరుగుతున్న మహిళల టి20 ప్రపంచ కప్ లో టీమిండియా బోణీ కొ ట్టింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన హర్మన్‌సేన ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజ యం సాధించింది. దీంతో టోర్నీలో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో టా స్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.

ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు 18.5 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ షెఫాలీ వర్మ (32; 35 బంతు ల్లో 3 ఫోర్లు), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (29 * రిటైర్డ్ హర్ట్), జెమీమా రోడ్రిగ్స్ (23) రాణించా రు. పాక్ బౌలర్లలో ఫాతిమా రెండు, సాదియా ఇక్బాల్, ఒమైమా తలో వికెట్ పడగొట్టారు. భార త్ తన తరువాతి మ్యాచ్ అక్టోబర్ 9న శ్రీలంకతో ఆడనుంది.

జెమీమా, షెఫాలీ అద్భుత భాగస్వామ్యం
లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా ఇన్నింగ్స్ ను నె మ్మదిగా ఆరంభించింది. సాదియా వేసిన ఐదో ఓ వర్‌లో స్మృతి మంధాన (7) వెనుదిరిగింది. అప్పటికీ భారత్ స్కోరు 18 మాత్రమే. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ తో కలిసి షెఫాలీ ఇ న్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఈ జోడీ 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. నిలకడ గా ఆడుతున్న షెఫాలీని ఒమైమా వెనక్కి పంపిం ది. అనంతరం హర్మన్ ప్రీత్, జెమీమా సింగిల్స్ రా బడుతూ స్కోరుబోర్డును ముందుకు కదిలించారు.

ఈ క్రమంలో 15 ఓవర్లకు జట్టు 79/2 స్కోరుతో నిలిచింది. అయితే, తర్వాతి ఓవర్ లో జెమీమా, రిచా ఘోష్ (0)ను ఫాతిమా వరుస బంతుల్లో ఔట్ చేయడంతో ఉత్కంఠ నెలకొంది. కానీ, హర్మన్, దీ ప్తి శర్మ (7) ఒత్తిడికి గురికాకుండా నిలకడగా ఆడి 18 ఓవర్లకు స్కోరు 100 దాటించారు. 19 ఓవర్లో నాలుగో బంతికి షాట్ ఆడే క్రమంలో హర్మన్ ప్రీత్ మెడ పట్టేసింది. దీంతో ఆమె రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజనా (4) ఫోర్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చింది.

పాక్ టపటపా
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ జట్టును భారత బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నిదా దర్ (28) టాప్ స్కోరర్. ఓపెనర్ మునీబా అలీ (17), ఫాతిమా సనా (13), తొమ్మిదో స్థానంలో వచ్చిన అరూబ్ షా (14 నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్ల ధాటికి గుల్ ఫెరోజా డకౌట్ గా వెనుదిరగ్గా.. సిద్రా అమీన్ (8), ఒమైమా (3), ఆలియా (4)ను సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో శ్రేయంకా పాటిల్ (2/6), అరుంధతి రెడ్డి (3/19) అదరగొట్టారు. రేణుకా సింగ్, దీప్తి శర్మ, ఆశా శోభన తలో వికెట్ పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అరుంధతి రెడ్డికి దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News