Monday, October 7, 2024

100 బిలియలన్ల క్లబ్ నుంచి అదానీ ఔట్!

- Advertisement -
- Advertisement -

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు భారత స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యుద్ధ భయాల నేపథ్యంలో గతేవారం స్టాక్‌మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో సెన్సెక్స్ 4000 పాయింట్లు పతనమైంది. దీంతో ఇన్వెస్టర్లు ఏకంగా రూ.1700 కోట్లు నష్టపోయారు. ఈ పతనం దేశంలోని ఇద్దరు బడా బిలయనీర్లు… ముకేశ్ అంబానీ, గౌతం అదానీపైనా తీవ్ర ప్రభావం చూపింది.

‘బ్లూమ్‌బర్గ్  బిలియనీర్ ఇండెక్స్’ ప్రకారం ఈ ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ రూ.13,444 కోట్లకుపైగా నష్టపోయారు. అదే సమయంలో గౌతం అదానీ రూ.7,915 కోట్లకుపైగా నష్టాన్ని చవిచూశారు. ఈ పతనంతో ముకేశ్ అంబానీ నికర విలువ 162 బిలియన్ డాలర్ల నుంచి 105 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయినప్పటికీ ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో 14వ స్థానంలో ఉన్నారు. మరోవైపు గౌతం అదానీ నికర విలువ 94.2 బిలియన్ డాలర్లకు పడిపోవడంతో ఈ జాబితాలో 18 స్థానానికి దిగజారారు. దీంతో ఆయన 100 బిలియన్ల క్లబ్ నుంచి  బయటకు వచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News