Tuesday, October 8, 2024

కాంగ్రెస్ ఓట్లను చీల్చి.. కూటమికి నమ్మక ద్రోహం చేశారు: కేజ్రీవాల్ పై ఆప్ ఎంపి ఫైర్

- Advertisement -
- Advertisement -

హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జమ్ముకశ్మీర్, హర్యానా రెండు రాష్ట్రాల్లో పోటీ చేసిన ఆప్ దారుణంగా విఫలమైంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్ లో ఆప్ పార్టీ పత్తా లేకుండా పోయింది. కనీసం డిపాజిజట్లు కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ పార్టీ ఎంపీ, సీనియర్ నాయకురాలు స్వాతి మలివాల్, అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల నేతృత్వంలోని భారత కూటమికి ఆప్ నమ్మక ద్రోహం చేస్తోందని మలివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

“కాంగ్రెస్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికే హర్యానాకు వచ్చారు. నన్ను బీజేపీ ఏజెంట్ అని తప్పుడు ఆరోపణలు చేసి, ఈరోజు కాంగ్రెస్ ఓట్లను చీల్చి భారత కూటమికి ద్రోహం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా మాజీ రెజ్లర్ వినేష్‌ ఫోగట్ ను ఓడించేందుకు అభ్యర్థిని కూడా నిలబెట్టారు. మీ స్వంత రాష్ట్రంలో మీ ఓటు శాతాన్ని కూడా మీరు కాపాడుకోలేని పరిస్థితి ఎలా వచ్చింది?. ఇంకా సమయం ఉంది.. మీ అహాన్ని పక్కన పెట్టండి, మీ డ్రామాలు ఆపండి, ప్రజల కోసం పని చేయండి” అని అరవింద్ కేజ్రీవాల్‌పై ఎంపీ మలివాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News