Tuesday, October 8, 2024

ఈడి ఎదుట విచారణకు హాజరైన అజరుద్దీన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లోని ఈడి కార్యాలయంలో విచారణకు హాజరైన అజరుద్దీన్

తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్న అజర్ 

హైదరాబాద్: మాజీ ఎంపీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అజరుద్దీన్ మంగళవారం ఈడి విచారణకు హాజరయ్యారు. హెచ్‌సీఏలో అవకతవకలకు సంబంధించి ఆయనకు ఈడి ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీంతో ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని ఈడి కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యారు.

విచారణ అనంతరం అజరుద్దీన్ మాట్లాడుతూ… తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియానికి సంబంధించి జనరేటర్లు, అగ్నిమాపక వాహనాలు, ఇతర సామాగ్రి కొనుగోళ్లకు సంబంధించి రూ.20 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ విషయంలో అజరుద్దీన్ తన స్పష్టీకరణ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News