Wednesday, October 16, 2024

స్మార్ట్ ఫోన్ల వినియోగదారుల సేవలో టాప్ లో నిలిచిన ‘ఒప్పో ఇండియా’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఇండియా వినియోగదారుల సేవలో ముందుంది. ఆప్టర్ సేల్స్ సర్వీసెస్ లో వినియోగదారులకు ఎంతో చేరువైంది. నేడు మొబైల్ ఫోన్లు కేవలం ఓ డివైస్ మాత్రమే కాదు. చాలా సేవలకు కీలకంగా మారాయి. అలాంటిది ఫోన్ లో ఏమైనా ఇబ్బంది వస్తే ఎంత వేధనకు గురవుతామో తెలిసిందే. అందుకే సరైన బ్రాండ్ ఫోన్లను కొనుక్కుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్మార్ట్ ఫోన్ కు ‘ట్రూ వ్యాల్యూ’ అనేది ఉండాలి.

ఇటీవల (ఆగస్టు 2024) ‘కౌంటర్ పాయింట్ రీసెర్చ్’  జరిపిన సర్వేలో ‘సేల్స్ ఆప్టర్ సర్వీసెస్’ లో ఒప్పో ఫోన్ల తయారీ సంస్థ ముందున్నట్లు తేలింది. సేల్స్ ఆఫ్టర్ సర్వీసెస్ లో 62 శాతం వినియోగదారుల సంతృప్తి తో టాప్ లో నిలిచింది. ఒప్పో ఫోన్ల ధర, రిపెయిర్, నాణ్యత, ఇబ్బందిని పరిష్కరాంచడంలో వేగం(speed of resolution), పారదర్శకత, నైపుణ్యంగల సిబ్బంది(staff expertise), వివిధ బాషల్లో మాట్లాడగలగడం(multilingual communication) విషయాల్లో వినియోగదారులకు సంతృప్తిని ఇస్తూ టాప్ లో నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News