Wednesday, October 16, 2024

గుంతలో దిగబడిన కారు… గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

అమరావతి: గంజాయిని తరలిస్తుండగా కారు గుంతలో దిగబడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. పాడేరు మండలం చింతలవీధి జంక్షన్ వద్ద కారు బురద గుంటలో దిగబడింది. కారును వదిలేసి నిందితులు పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కారు లోపల తనిఖీలు చేయగా 500 కేజీల గంజాయి ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News