Wednesday, October 16, 2024

టిజిపిఎస్ సి  గ్రూప్‌1 మెయిన్స్‌ హాల్‌ టికెట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

రేపు హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

హైదరాబాద్‌: తెలంగాణ గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షల హాల్‌ టికెట్లు సోమవారం (అక్టోబర్‌ 14) విడుదలయ్యాయి. ఓ వైపు అభ్యర్ధులు మెయిన్స్‌ వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తుంటే, మరోవైపు టిజిపిఎస్సీ వడివడిగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పరీక్షలకు ఏర్పాట్లు కూడా పూర్తిచేసింది. ఈ క్రమంలో ఇవాళ టిజిపిఎస్సీ హాల్‌టికెట్లను విడుదల చేసింది.  అభ్యర్ధులు తమ వివరాలను వెబ్ సైట్లో నమోదు చేసి, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇక గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరుగనున్నాయి. హైదరాబాద్‌ పరిధిలోనే ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే కమిషన్‌ స్పష్టం చేసింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ tspsc.gov.in నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొత్తం 563 గ్రూప్‌1 పోస్టుల భర్తీకి టిజిపిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

మెయిన్స్‌ పరీక్షలు మొత్తం 7 పేపర్లకు ఉంటాయి. తొలిరోజు పరీక్షకు తీసుకెళ్లిన హాల్ టిక్కెట్‌నే మిగిలిన ఆరు పరీక్షలకు తీసుకెళ్లాల్సి ఉంటుందని టిజిపిఎస్సీ స్పష్టం చేసింది. రోజుకో కొత్త హాల్ టిక్కెట్‌తో వెళితే అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అలాగే ప్రతిపరీక్ష రోజు హాల్ టిక్కెట్‌పై ప్రతి అభ్యర్ధి తప్పనిసరిగా సంతకం చేయాలని తెలిపింది. నియామక ప్రక్రియ పూర్తి అయ్యేవరకు ఈ హాల్‌ టికెట్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించింది.

మరోవైపు గ్రూప్‌1 ప్రిలిమ్స్‌ కు సంబంధించి దాఖలైన పలు కేసులపై హైకోర్టు తుది తీర్పును మంగళవారం వెల్లడించనుంది. ఆయా కేసుల్లో ఇప్పటికే విచారణను పూర్తిచేసిన హైకోర్టు తీర్పును మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  ఇప్పటికే గ్రూప్‌1పై హైకోర్టులో 15కుపైగా కేసులు ఉన్నాయి. వీటిలో ఫైనల్‌ ‘కీ’పై వేసిన కేసు అత్యంత కీలకంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News