Wednesday, October 16, 2024

సినీ పరిశ్రమను ప్రభుత్వం పెద్ద ఎత్తున గౌరవిస్తుంది

- Advertisement -
- Advertisement -

ఈ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదగాలి
తెలంగాణ భావోద్వేగాలను తన ఆట, పాట ద్వారా
ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి గద్దర్
తెలంగాణ మొత్తానికి ప్రతిరూపం గద్దర్
గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : సినీ పరిశ్రమను ప్రభుత్వం పెద్ద ఎత్తున గౌరవిస్తుందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమ వారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన గద్దర్ సినీ అవార్డుల కమిటీ మొదటి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సినీ పరిశ్రమ దేశంలోనే కాదు ప్రపంచములోనే శాసించే స్థాయికి ఎదగాలన్నారు. సినీ పరిశ్రమకు ఏ సమస్యలు ఉన్నా వినడానికి, పరిష్కరించ డానికి సిద్ధంగా ఉన్నామని సిఎం రేవంత్ రెడ్డి మీ అందరితో చెప్పాలని కోరినట్టు వివరించారు. సినీ పరిశ్రమల అవార్డుల విషయానికొస్తే నంది అవార్డులు ఒక పండుగల నిర్వహించేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఎందుకో గత ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదన్నారు. తెలంగాణ అంటే నే సాంస్కృతిక జీవనం. తెలంగాణ అంటేనే ఆట, పాట ఇక్కడ బాధ వచ్చిన సంతోషం వచ్చినా పాట ద్వారానే వ్యక్త పరుస్తాము అని వివరించా రు.

తెలంగాణ సంస్కృతి చాలా గొప్పది, అందర్నీ అక్కున చేర్చుకొని, ప్రేమించే సంస్కృతి మన రాష్ట్రంలో ఉంటుందన్నారు. అసమానతలు, వైరు ధ్యాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నారని వివరించారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అం టూ సమాజాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనకు సమాయత్తం చేసి నడిపించిన ప్రజా యుద్ధనౌక గద్దర్ అని అన్నారు. గద్దర్ ఒక లెజెండ్, ఒక శతాబ్ద కాలంలో ఆయన లాంటి వ్యక్తి పుడతారని నేను అనుకోవడం లేదని, ప్రపంచంలోని అన్ని సమస్యలపై ఆయన ప్రజలను పాటలతో కదిలించాలని వెల్లడించారు. తెలంగాణ ఆట, పాటను ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి గద్దర్ అని అన్నారు. తెలంగాణలో ఏ గ్రామంలో చూసి న గద్దర్ లాగే పాడాలని ప్రయత్నిస్తుంటారు, ఆయనను అనుకరిస్తుంటారు తెలంగాణ మొత్తానికి గద్దర్ ప్రతిరూపమని వెల్లడించారు. అడవి, సినిమా, మానవులు, రాజ్యాంగం అన్నిట్లో గద్దర్ తనదైన ముద్ర వేశారన్నారు.

గద్దర్ మొదట విప్లవోద్యమ బాటలో అడవి బాట పట్టిన కాలక్ర మమైన దేశంలోని అన్ని సమస్యలకు భారత రాజ్యాంగమే పరిష్కారమని భావించి దాన్ని ఆయన విస్తృతంగా ప్రచారం చేశారని వివరించారు. అన్ని అంశాలు పరిశీలించే ప్రభుత్వం గద్దర్ పేరిట సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయిం చిందని కమిటీ సభ్యులకు వివరించారు. అన్ని అవా ర్డుల తరహాలోనే అన్ని రంగాలకు గద్దర్ అవార్డులు ఇచ్చుకోవచ్చని తెలిపారు. సినీ పరిశ్రమ లోని అందర్నీ గౌరవించుకోవాలి, ప్రతి అవార్డు గొప్ప గా ఉండాలని ప్రభుత్వం కోరుతుందని వెల్లడించారు. గద్దర్ అవార్డుల కార్యక్రమం గొప్ప పండుగలా జరగాలి, ఏ తేదీన జరపాలనేది కమిటీ నిర్ణయం తీసుకోవాలని కోరారు. గద్దర్‌ను అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తిగా ప్రభుత్వం గుర్తిం చిందన్నారు.

కొద్దిరోజుల్లోనే కమిటీ మరో మారు సమావేశమై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని కమిటీ సభ్యులను కోరారు. ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ అద్భుతమైనదని ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ సమావేశంలో డిప్యూటీ సిఎంకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన స్కిల్ యూనివర్సిటీలో యాక్టింగ్ స్కిల్స్ నేర్పించేందుకు ప్రత్యేక కోర్స్ ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు కోరారు. అన్ని అంశాలు పరిశీలించి ఇంటిగ్రేటెడ్ స్కూల్, స్కిల్ యూనివర్సిటీలో యాక్టింగ్, కల్చర్ కు సంబంధించిన అంశాలకు చోటు కల్పించడం పై నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సిఎం తెలి పారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, కమిటీ సభ్యులు నర్సింగరావు, తనికెళ్ల భరణి, సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, దిల్ రాజు, హరీష్ శంకర్, వందేమాతరం శ్రీనివాస్, అల్లాని శ్రీధర్, గుమ్మడి విమల సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News