Wednesday, October 16, 2024

కులగణనతో బండి సంజయ్‌కు నష్టం ఏమిటీ?

- Advertisement -
- Advertisement -

బిసిలకు న్యాయం జరగాలంటే కులగణన జరగాల్సిందే….
కాంగ్రెస్ నాయకుడు లింగం యాదవ్

మనతెలంగాణ/హైదరాబాద్:  కులగణనతో బండి సంజయ్‌కు నష్టం ఏమిటని కాంగ్రెస్15 నాయకుడు లింగం యాదవ్ ప్రశ్నించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బిసిలకు న్యాయం జరగాలంటే కులగణన జరగాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్లే, ఇచ్చిన మాటను నిలపెట్టుకుంటున్నామన్నారు. బిసి, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగాలంటే కుల గణన జరగాలని రాహుల్ గాంధీ నిర్ణయించారన్నారు. కానీ, ఇలాంటి మంచి నిర్ణయంపై కూడా బిజెపి విమర్శలు సరికాదన్నారు. కులగణన చేస్తామంటే బిజెపి ఎందుకు భయపడుతుందని ఆయన ప్రశ్నించారు.

బిజెపి అంటేనే బిసిల వ్యతిరేకమైన పార్టీ అని ఆయన వెల్లడించారు. బిసిల రిజర్వేషన్ తగ్గడానికి బిఆర్‌ఎస్ కూడా కారణమన్నారు. ఓయూ జేఏసీ నేత కోట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రూప్-1 ఫలితాలు విడుదల చేసి, టీచర్లకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చింది బండి సంజయ్‌కు గుర్తులేదా? అంటూ ఆయన చురకలు అంటించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు పోరాడటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల గణన పేరుతో టైం పాస్ చేస్తున్నామని బండి మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. వర్షాల కారణంగా రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే, కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుండా ఎందుకు టైం పాస్ చేశారు? అంటూ ఆయన ప్రశ్నించారు. పేదలకు మంచి చేయాలని హైడ్రా చేపడుతుంటే, ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా పేదలను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. జవహర్‌నగర్‌లో పేదలకు 150 గజాలు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, కానీ, బిజెపి, బిఆర్‌ఎస్‌లు అడ్డుపడుతున్నాయని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News