Thursday, October 24, 2024

‘సోల్వ్ ఫర్ టుమారో 2024’ విజేతలను ప్రకటించిన సామ్‌సంగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సామ్‌సంగ్ తమ ప్రతిష్టాత్మక జాతీయ విద్య మరియు ఆవిష్కరణల పోటీ అయిన ‘సాల్వ్ ఫర్ టుమారో 2024’ యొక్క 3వ ఎడిషన్‌లో గెలుపొందిన జట్లను ప్రకటించింది. పలు విభాగాలలో ‘ఎకో టెక్’ ఇన్నోవేటర్ మరియు మెటల్‌ బృందాలను విజేతలుగా సామ్‌సంగ్ ఇండియా ప్రకటించింది. అస్సాంలోని గోలాఘాట్‌కు చెందిన ఎకో టెక్ ఇన్నోవేటర్ స్కూల్ ట్రాక్‌లో కమ్యూనిటీ ఛాంపియన్‌గా నిలవగా కర్ణాటకలోని ఉడిపికి చెందిన ‘మెటల్’ యూత్ ట్రాక్‌లో ఎన్విరాన్‌మెంట్ ఛాంపియన్‌గా ప్రకటించబడింది, ఇది ప్రధాన భారతీయ నగరాల ఆవల ప్రోగ్రామ్ యొక్క పరిధిని ప్రదర్శిస్తుంది.

కాలుష్య రహిత త్రాగునీటికి సమానమైన అవకాశాలను గురించి ఒక ఆలోచనను ఎకో టెక్ ఇన్నోవేటర్ అభివృద్ధి చేసింది, ప్రోటోటైప్ అడ్వాన్స్‌మెంట్ కోసం రూ. 25 లక్షల సీడ్ గ్రాంట్‌ను అందుకుంది. భూగర్భ జలాల నుండి ఆర్సెనిక్‌ను తొలగించే సాంకేతికతను అభివృద్ధి చేసిన మెటల్ , ఐఐటి -ఢిల్లీలో ఇంక్యుబేషన్ కోసం రూ. 50 లక్షల గ్రాంట్‌ను అందుకుంది. సామ్‌సంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సీఈఓ జెబి పార్క్ మరియు భారతదేశంలోని ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ షోంబి షార్ప్ ఈ జట్లకు సర్టిఫికెట్లు మరియు ట్రోఫీలను ప్రదానం చేశారు.

అదనంగా, ‘కమ్యూనిటీ ఛాంపియన్’ పాఠశాల విద్యలో సహాయం చేయడానికి మరియు సమస్యను పరిష్కరించే ఆలోచనను ప్రోత్సహించడానికి స్మార్ట్ డిస్ప్లే ఫ్లిప్ 75″, ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్ మరియు 10 గెలాక్సీ ట్యాబ్ ఎస్10+తో సహా సామ్‌సంగ్ ఉత్పత్తులను అందుకుంటుంది. అదేవిధంగా, సామాజిక వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ‘ఎన్విరాన్‌మెంట్ ఛాంపియన్’ కళాశాల స్మార్ట్ డిస్‌ప్లే ఫ్లిప్ 75”, ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్ మరియు 10 గెలాక్సీ బుక్ 4 ప్రో ల్యాప్‌టాప్‌లను అందుకుంటుంది.

ఇదిలా ఉంటే 10 జట్లూ ఒక్కొక్కటి రూ. 1 లక్ష అందుకోగా, సభ్యులందరూ సర్టిఫికేట్‌లను అందుకున్నారు. అదనంగా, స్కూల్ ట్రాక్ పార్టిసిపెంట్‌లు గెలాక్సీ వాచ్ అల్ట్రాని అందుకున్నారు. యూత్ ట్రాక్ పార్టిసిపెంట్‌లు గెలాక్సీ జెడ్ ఫ్లిప్6ని అందుకున్నారు. ఫ్లాగ్‌షిప్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్, సామ్‌సంగ్ సాల్వ్ ఫర్ టుమారో, నిజ జీవిత సమస్యలను పరిష్కరించేందుకు మరియు వారి వినూత్న ఆలోచనలతో ప్రజల జీవితాలను మార్చడానికి దేశంలోని యువతకు సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.

“సామ్‌సంగ్ వద్ద , ఈ సంవత్సరం ‘సాల్వ్ ఫర్ టుమారో’ ఎడిషన్‌లో పాల్గొన్న వారందరూ ప్రదర్శించిన ఆవిష్కరణ మరియు సృజనాత్మకత గురించి మేము గర్విస్తున్నాము. మా ఫ్లాగ్‌షిప్ సీఎస్ఆర్ కార్యక్రమం ద్వారా, తమ కమ్యూనిటీలు మరియు పర్యావరణంలో అత్యంత ముఖ్యమైన సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన సాధనాలు, మార్గదర్శకత్వం మరియు అవకాశాలను అందించడం ద్వారా యువతను శక్తివంతం చేయడం మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఎకో టెక్ ఇన్నోవేటర్ మరియు మెటల్ యొక్క విజయాలు సాంకేతికత మరియు ఆవిష్కరణల ద్వారా అర్థవంతమైన ప్రభావాన్ని సృష్టించగల తదుపరి తరం యొక్క సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ యువ ఆవిష్కర్తల ఆలోచనలకు జీవం పోసి, శాశ్వతమైన మార్పు తీసుకురావాలని మేము ఎదురుచూస్తున్నాము” అని సామ్‌సంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్ మరియు సీఈఓ జెబి పార్క్ అన్నారు.

“ఈ యువ ఆవిష్కర్తలను వారి అభివృద్ధి యొక్క క్లిష్టమైన దశలో తీర్చిదిద్డేందుకు సామ్‌సంగ్ తో భాగస్వామ్యం చేసుకోవటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాము. మా భాగస్వామ్యం ద్వారా, మేము మెంటర్‌షిప్, శిక్షణ మరియు అత్యాధునిక వనరులకు అవకాశాలను అందించాము, అవి విశ్వాసాన్ని కలిగించాయి మరియు పోటీలో పాల్గొనే వారి ఆలోచనలను ఫలవంతం చేయడానికి శక్తినిచ్చాయి. టీమ్ ఎకో టెక్ ఇన్నోవేటర్ మరియు మెటల్ సాధించిన అద్భుతమైన పురోగతిని చూసి మేము గర్విస్తున్నాము. వారి పరిష్కారాలు సమాజానికి మరియు పర్యావరణానికి అర్థవంతంగా దోహదపడతాయని మేము విశ్వసిస్తున్నాము, ”అని ఐఐటి ఢిల్లీలోని ఎఫ్ఐటిటి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ అగర్వాల్ అన్నారు.

“న్యూయార్క్‌లో జరిగిన యుఎన్ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్‌లో ప్రపంచ నాయకులు ఏకతాటి పైకి రావటంతో పాటుగా ఎస్ డి జి లను మరియు మన ఏకైక గ్రహాన్ని రక్షించడానికి అత్యవసర చర్యలను తీసుకోవాల్సిన చర్యలను అంగీకరించారు. సాల్వ్ ఫర్ టుమారో ప్రోగ్రామ్ మనకు అవసరమైన పరిష్కార-ఆధారిత ఆవిష్కరణ మరియు సృజనాత్మక ఆలోచనలను అన్‌లాక్ చేయడానికి వారు పిలుపునిచ్చిన యువత అనుసంధానతకు ఉదాహరణగా నిలుస్తుంది. టీమ్ ఎకో టెక్ ఇన్నోవేటర్ మరియు మెటల్ యొక్క విజయాలు యువ మనస్సులకు సరైన నైపుణ్యాలు, వనరులు మరియు కొత్త ఆవిష్కరణలకు ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉన్నప్పుడు ఏమి సాధించవచ్చో చూపిస్తుంది. ఈ ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించినందుకు సామ్‌సంగ్ కు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము మరియు అద్భుతమైన విజయాన్ని సాధించిన విజేతలను మేము అభినందిస్తున్నాము” అని భారతదేశంలోని ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ షోంబి షార్ప్ అన్నారు.

22 మంది విద్యార్థులు ప్రాతినిథ్యం వహించిన టాప్ 10 జట్లను గ్రాండ్ ఫినాలేకు ఎంపిక చేసి, గ్రాండ్ జ్యూరీకి ప్రోటోటైప్‌లను ప్రదర్శించడానికి ఎంపిక చేశారు, ఇందులో బెంగళూరు లోని సామ్‌సంగ్ ఆర్‌&డి ఇన్‌స్టిట్యూట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మోహన్ రావ్ గోలి, ఐఐటి – ఢిల్లీ లో డిపార్ట్మెంట్ అఫ్ డిజైన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసన్ వెంకటరామన్, భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయంలో స్ట్రాటజిక్ అలయన్స్‌స్ , డైరెక్టర్, డాక్టర్ సప్నా పోటి మరియు సైంటిస్ట్ ‘జి ‘ మరియు , మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఐటి (మీటి)లో ఆర్& డి గ్రూప్ కోఆర్డినేటర్ సునీతా వర్మ ఉన్నారు.

గ్రాండ్ ఫినాలే పిచ్ ఈవెంట్‌తో ప్రారంభమైంది, దాని తర్వాత అవార్డుల వేడుక జరిగింది. సాల్వ్ ఫర్ టుమారో యొక్క మునుపటి ఎడిషన్‌ల విజేతలతో పాటు, 10 టీమ్‌ల సభ్యులు, గ్రాండ్ జ్యూరీ మరియు మెంటార్‌లతో పాటు ఎఫ్ఐఐటి , ఐఐటి ఢిల్లీ, మీటి మరియు భారతదేశంలోని ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు, సామ్‌సంగ్ నుండి ఉన్నత అధికారులు మరియు ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

విద్యార్థులు తమ ఆలోచనలను ‘కమ్యూనిటీ అండ్ ఇన్‌క్లూజన్’ మరియు ‘ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టైనబిలిటీ’ అనే రెండు ప్రధాన అంశాల క్రింద సమర్పించారు. యూత్ ట్రాక్ ఈ విస్తృత ఇతివృత్తాల క్రింద ఆలోచనలను సమర్పించింది, అయితే, చాలా ఆలోచనలు బీద వర్గాలకు చెందిన కమ్యూనిటీలకు విద్య మరియు వనరుల ప్రాప్యత , అనుభవపూర్వక అభ్యాసంలో సవాళ్లు, డిజిటల్ అక్షరాస్యత, నీటి సంరక్షణ మరియు ఆర్సెనిక్ కాలుష్యం వంటి కీలక సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించాయి.

కార్యక్రమంలో ప్రధాన బహుమతులతో పాటు, ‘సోషల్ మీడియా ఛాంపియన్ అవార్డు’ మరియు ‘గుడ్‌విల్ అవార్డు’ అనే రెండు ప్రత్యేక అవార్డులను కూడా అందించారు. స్కూల్ ట్రాక్ నుండి ‘ప్రీటర్ విఆర్’ మరియు యూత్ ట్రాక్ నుండి ‘బయో డి’ కి ప్రేక్షకుల ఎంపిక విజేతలను సత్కరించే గుడ్‌విల్ అవార్డులు లభించాయి. రెండు జట్లూ రూ. 1 లక్ష నగదు బహుమతిని అందుకున్నాయి. అదనంగా, స్కూల్ ట్రాక్ నుండి యు మరియు యూత్ ట్రాక్ నుండి ఎన్విటెక్ టీమ్‌లు సోషల్ మీడియా సహకారానికి గుర్తింపుగా ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున ‘సోషల్ మీడియా ఛాంపియన్ అవార్డు’ను గెలుచుకున్నారు.

ఈ సంవత్సరం, శంకర్ శ్రీనివాస్, 2022 ‘సాల్వ్ ఫర్ టుమారో’ విజేత తన వినూత్నమైన ‘స్పుత్నిక్ బ్రెయిన్’కి గుర్తింపు పొందారు, ఇటీవల ‘టుగెదర్ ఫర్ టుమారో’ అంబాసిడర్‌గా నియమితులయ్యారు, అవార్డు ప్రదానోత్సవంలో తన స్ఫూర్తిదాయకమైన ప్రయాణం మరియు అనుభవాన్ని పంచుకున్నారు. అతని కథ ఆవిష్కరణ మరియు అభిరుచి యొక్క శక్తిని ప్రదర్శిస్తుంది, సృజనాత్మకత మరియు సంకల్పంతో వాస్తవ-ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి యువ మనస్సులను ప్రోత్సహిస్తుంది.

సామ్‌సంగ్ యువ ఆవిష్కర్తలను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంది, తమ ఆలోచనలను వాస్తవికతగా మార్చడానికి సాధనాలు మరియు వనరులతో వారిని సన్నద్ధం చేస్తుంది. గత కొన్ని వారాలుగా, సామ్‌సంగ్ , ఎఫ్ఐఐటి మరియు ఐఐటి -ఢిల్లీకి చెందిన నిపుణులు టాప్ 10 టీమ్‌లతో సన్నిహితంగా పనిచేశారు, వాస్తవ ప్రపంచ సవాళ్లకు వినూత్నమైన మరియు సంచలనాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేసినందున వారికి మార్గదర్శకత్వం వహించారు. ఈ మార్గదర్శకత్వం బృందాలు వారి ఆలోచనలను మెరుగుపరచడంలో సహాయపడ్డాయి మరియు ఫంక్షనల్ ప్రోటోటైప్‌లను అభివృద్ధి చేయడం ద్వారా వారికి మార్గనిర్దేశం చేసింది. ఈ నమూనాలు గ్రాండ్ ఫినాలే సమయంలో జ్యూరీకి సమర్పించబడ్డాయి.

ఈ సంవత్సరం, మణిపూర్‌లోని ఇంఫాల్ నుండి మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ మరియు ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ వరకు భారతదేశంలోని టైర్ 2 మరియు 3 నగరాలు మరియు మారుమూల ప్రాంతాల నుండి పాఠశాలలు మరియు కళాశాలల నుండి పాల్గొన్నారు. స్థానిక సవాళ్లను పరిష్కరించడానికి ఉద్దేశించిన వినూత్న ఆలోచనలతో, వారు తమ కమ్యూనిటీలను మార్చడానికి మాత్రమే కాకుండా విస్తృత జాతీయ సమస్యలను పరిష్కరించడానికి, సాంకేతికతను ఉపయోగించి దేశవ్యాప్తంగా సానుకూల మార్పును తీసుకురావడానికి కూడా తోడ్పాటు అందించారు.

యుఎస్ లో మొదటిసారిగా 2010లో, “సాల్వ్ ఫర్ టుమారో” కార్యక్రమం ప్రారంభించబడింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 63 దేశాల్లో క్రియాశీలంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2.3 మిలియన్లకు పైగా యువ ఆవిష్కర్తలతో కలిసి పనిచేస్తుంది. సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ యొక్క గ్లోబల్ సీఎస్ఆర్ లక్ష్యం – “ టుగెదర్ ఫర్ టుమారో ! ఎనేబ్లింగ్ పీపుల్ ! తో సమలేఖనం చేయబడింది. భవిష్యత్తులో నాయకులుగా మారడానికి అవసరమైన విద్య మరియు నైపుణ్యాలతో యువతను సన్నద్ధం చేయడానికి ఈ కార్యక్రమం అంకితం చేయబడింది. సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సీఎస్ఆర్ కార్యక్రమాల గురించి మరింత తెలుసుకోవడానికి, http://csr.samsung.comలో మా సీఎస్ఆర్ వెబ్‌పేజీని సందర్శించండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News