Wednesday, October 16, 2024

మేడ్చల్ లో దారుణం.. గోనె సంచిలో బాలిక మృతదేహం

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరగడి గ్రామంలో గోనె సంచిలో బాలిక మృతదేహం లభించింది. స్థానికుల వివరాల ప్రకారం.. అదిలాబాద్ జిల్లా చెందిన ప్రభాకర్ కుటుంబంతో కలిసి సూరారంలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 12న కుమార్తె ఏం జోష్న(7) కనిపించడం లేదని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, బాలిక మంగళవారం శవమై కనిపించింది. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News