Wednesday, October 16, 2024

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అంధేరీ వెస్ట్‌లోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్ వద్ద రియా మహల్ అనే 14 అంతస్తుల నివాస భవనంలో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి. భవనంలోని 10వ అంతస్తులో మంటలు అలుముకోవడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గాయపడి వారిని బయటకు తీసుకొచ్చిన సిబ్బంది.. చికిత్స కోసం వెంటనే కూపర్ ఆసుపత్రికి తరలించారు.అయితే, అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని పౌర అధికారి తెలిపారు. మృతులను చంద్రప్రకాష్ సోని (74), కాంత సోని (74), పెలుబేట (42)గా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News