Thursday, October 17, 2024

హీరోయిన్ రష్మిక మందన్నకి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

సినీ హీరోయిన్ రష్మిక మందన్నకి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన రష్మిక మందన్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. దేశంలో సైబర్ భద్రతకు జాతీయ అంబాసిడర్‌గా ప్రజల్లో, ముఖ్యంగా యువతలో సరైన అవగాహన కల్పించడంలో మీ నియామకం ఉపయోగపడుతుందని అభిలషిస్తున్నానని తన ట్వీట్‌లో కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

‘మనం డిజిటల్ యుగంలో జీవిస్తున్నాము, అలాగే ఇప్పుడు సైబర్ క్రైమ్ అత్యధిక స్థాయిలో ఉంది. నా డీప్ ఫేక్ వీడియోని క్రియేట్ చేసి బాగా వైరల్ చేశారు. ఇలాంటి సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నిలబడాలని, వీటిపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను. అందుకే నేను భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాన’ని ఓ వీడియోను రష్మిక మందన్న కూడా విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News