Thursday, October 17, 2024

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై అరెస్టు వారెంట్‌ జారీ

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు మరో షాక్ తగిలింది. ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లు హింసాత్మకంగా మారడంతో ఆమె దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులు ఆమె నివాసంపై దాడి చేస్తారని తెలుసుకున్న హసీనా రహస్యంగా ప్రత్యేక హెలిక్యాప్టర్ లో దేశం వడిచి భారత్ కు వచ్చి తలదాచుకుంటోంది. దీంతో హసీనా ప్రభుత్వం అర్థాంతరంగా కుప్పకూలిపోయింది.

ప్రస్తుతం ఆమె ఇండియాలోనే ఉన్నారు. దేశ పాలనను చేతుల్లోకి బంగ్లా ఆర్మీ.. పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంది. అనంతరం నోబెల్ విజేత మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే, మాజీ ప్రధాని షేక్‌ హసీనాను బంగ్లా ప్రభుత్వం అరెస్టు చేసేందుకు సిద్ధమైంది. ఈక్రమంలోనే నవంబరు 18లోగా ఆమెను అరెస్టు చేసి తమ ఎదుట హాజరు పరచాలని బంగ్లాదేశ్‌ ఇంటర్నేషనల్ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ చీఫ్‌ ప్రాసిక్యూటర్ మహమ్మద్‌ తజుల్‌ ఇస్లాం అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News