Friday, October 18, 2024

సంగారెడ్డిలో జాతీయ రహదారి పక్కన మహిళ మృతదేహం

- Advertisement -
- Advertisement -

చౌటాకూర్: సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం న్యూ ఓన్నాపూరం వద్ద మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. జాతీయ రహదారి పక్కన చెట్ల పొదల్లో 28 ఏళ్ల మహిళ మృతదేహం కనిపించిడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు గంగోజీపేటకు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారా? లేదా కుటుంబ కలహాలతో హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు ప్రాథమిక సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News