Friday, October 18, 2024

రచిన్ రవీంద్ర సెంచరీ… కివీస్ 402

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు కివీస్ జట్టు 91.2 ఓవర్లలో 402 పరుగుల వద్ద ఆలౌటైంది. కివీస్ జట్టు 356 పరుగుల ఆధిక్యంలో ఉంది. రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగాడు. డెవన్ కాన్వే, టీమ్ సౌథీ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. కివీస్ బ్యాట్స్‌మెన్లలో రచిన్ రవీంద్ర(134), డెవన్ కాన్వే(91), టిమ్ సౌథీ(65) విల్ యంగ్(33), డారీల్ మిచెల్(18), గ్లెన్ ఫిలీప్స్(14), టామ్ లాథమ్(15), టామ్ బ్లండెల్(05), మ్యాట్ హెన్రీ(08), అజాజ్ పటేల్(04) పరుగులు చేశారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ చెరో ఒక వికెట్ తీశారు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News