Friday, October 18, 2024

ఆ వాయుగుండం దిశ ఎటు?

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపిలోని దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. వచ్చే వారం మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అలర్ట్ జారీ చేసింది. దీనిపై ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపిఎస్డీఎంఏ) స్పందించింది.

ప్రస్తుతం ఐఎండి సమాచారం మేరకు అక్టోబరు 22 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అది వాయవ్య దిశగా పయనిస్తూ మరింత బలపడి, అక్టోబరు 24 నాటికి వాయుగుండంగా మారుతుందని ఏపిఎస్డీఎంఏ వివరించింది. అయితే, ఈ వాయుగుండం ఎటు వెళుతుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంది. కాగా, ప్రైవేటు వాతావరణ సంస్థల అంచనాల ప్రకారం… ఈ వాయుగుండం ఏపి ఉత్తర కోస్తా, ఒడిశా దక్షిణ తీరం దిశగా పయనిస్తుందని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News