Saturday, October 19, 2024

విసిలొచ్చారు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో తొమ్మిది వి శ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్‌లు నియమితులయ్యా రు. వైస్ ఛాన్సలర్‌ల నియామకపత్రాలపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సంతకాలు చేశారు. దీంతో విసిలను నియమి స్తూ ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీగా విసి మొలుగరం కుమార్ నియమితులు కాగా, కాకతీయ వర్సిటీ విపిగా ప్రతాప్ రెడ్డి, మహాత్మా గాంధీ వర్సిటీ విసిగా అల్తాఫ్ హుస్సేన్, తెలంగాణ వర్సిటీ విసిగా యాదగిరి రావు, పాలమూరు వర్సిటీ విసిగా జీఎన్ శ్రీనివాస్, తెలుగు వి శ్వవిద్యాలయం విసి నిత్యానందరావు, శాతవాహన యూనివర్సిటీ విసిగా ఉమేశ్ కుమార్, ప్రొఫెసర్ జయ శంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గా అల్దాస్ జానయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం విసిగా ప్రొఫెసర్ రాజిరెడ్డి నియామకం అయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News