Saturday, October 19, 2024

నాలుగో రోజు ఆట ప్రారంభం.. క్రీజ్‌లోకి రిషభ్ పంత్

- Advertisement -
- Advertisement -

భారత్ – న్యూజిలాండ్ తొలి టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభం అయ్యింది. ఓవర్ నైట్ స్కోరు 231/3తో భారత్ శనివారం ఆటను ప్రారంభించింది. నిన్న విరాట్ కోహ్లీ ఔట్ అయిన తర్వాత ఆట ముగించారు అంపైర్లు. దీంతో ఈరోజు సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి రిషభ్ పంత్ క్రీజ్‌లోకి వచ్చాడు.

అయితే, గాయం కారణంగా వికెట్ కీపింగ్‌కు దూరంగా ఉన్న పంత్ బ్యాటింగ్‌కు వస్తాడో రాడో అని అందరూ అనుమానపడ్డారు. కాగా ప్రస్తుతం భారత్ 16 ఓవర్లలో 245 పరుగులు చేసింది. సర్ఫరాజ్(83), పంత్(1)లు కొనసాగుతున్నారు. భారత్, న్యూజిలాండ్ కంటే ఇంకా 111 పరుగులు వెనుకంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News