Saturday, October 19, 2024

‘స్త్రీ 3’ పనులు స్టార్ట్ అయ్యాయి: శ్రద్ధా కపూర్‌

- Advertisement -
- Advertisement -

‘స్త్రీ-2’ ఇటీవల విడుదలైన ఈ మూవీ బాలీవుడ్ భాక్సాఫీస్ ను షేక్ చేసింది. బడా హీరోలకు షాకిస్తూ రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్‌ రావు జంటగా నటించిన ఈ సినిమా హర్రర్ కామెడీగా రూపొందింది. రిలీజ్ అయిన తొలి రోజు నుంచే అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోయింది.

ప్రస్తుతం ఈ సినిమా బాలీవుడ్ లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కించనున్నట్లు హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ వెల్లడించింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ను శ్రద్ధాకపూర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పరచుకుంది. ప్రస్తుతం ‘స్త్రీ 3’ పనులు మొదలయ్యాయని వెల్లడించింది. కాగా, ఈ సినిమా ఈ కథ విన్నప్పుడు ఆశ్చర్యపోయాయని శ్రద్ధా తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News