Tuesday, October 22, 2024

తెలుగు రాష్ట్రాల మధ్య ఎల్లుండి మరో కీలక భేటీ

- Advertisement -
- Advertisement -

హాజరు కానున్న తెలంగాణ, ఎపి ప్రభుత్వ ప్రతినిధులు 
అపరిష్కృత సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం
కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో హస్తినలో భేటీ

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, ఎపి మధ్య విభజన సమస్యల పరిష్కారానికి మరో కీలక అడుగు పడింది. తెలు గు రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లయినప్పటికీ, ఇంకా అనేక అం శాలు ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఈ అపరిష్కృత అంశాలపై కేంద్ర హోంశాఖ చొరవ తీసుకుని సమావేశాలు ఏర్పాటు చే స్తోంది. తాజాగా, ఈ నెల 24న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భేటీలో తెలంగాణ, ఎపి ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొననున్నారు.

ఇరు రాష్ట్రాలకు చెందిన వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొనే ఈ సమావేశానికి హాజరుకావాలని తెలంగాణ సిఎస్‌కు కేంద్ర హోంశాఖ సమాచారమిచ్చిం ది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎపి సిఎం చంద్రబాబు, ఢిల్లీలో ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలిసి విభజన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News