Tuesday, October 22, 2024

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కేవలం 2 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పడుతున్నది. ఇక, సోమవారం శ్రీవారిని 64,894 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి 23,355 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News