Tuesday, October 22, 2024

జబల్పూర్ ఆయుధ కర్మాగారంలో పేలుడు : 15 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ ఆయుధ కర్మాగారంలో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. ఖమరియాలోని సెంట్రల్ సెక్యూరిటీ ఇనిస్టిట్యూట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. అక్కడ బాంబులు, పేలుడు సామాగ్రి తయారుచేస్తుంటారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీ రీఫిల్లింగ్ సెక్షన్ లో ఈ పేలుడు సంభవించిందని సమాచారం. పేలుడు సంభవించిన ప్రదేశంలోని   చట్టుపక్కల వారు ఆ పేలుడు ఓ పెద్ద భూకంపంలా ఉండిందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News