Wednesday, October 23, 2024

నాగ్‌పూర్‌లో పట్టాలు తప్పిన షాలిమార్ ఎక్స్‌ప్రెస్

- Advertisement -
- Advertisement -

ఎల్‌టిటి-షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు బోగీలు మంగళవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వద్ద పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ముంబై నుంచి కోల్‌కతకు వెళుతున్న ఎల్‌టిటి-షాలిమార్ కుర్లా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పార్సిల్ వ్యానుకు చెందిన పార్సిల్ వ్యాను, ఒక పాసింజర్ బోగీ నగరంలోని కలమ్నా లైను వద్ద మధ్యాహ్నం 2 గంలల ప్రాంతంలో క్రాసింగ్ దాటుతూ పట్టాలు తప్పినట్లు ఆ అధికారి చెప్పారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని, రైల్వే బృందాలు ఐదు నిమిషాలలో ఘటనా స్థలికి చేరుకున్నాయని ఆయన తెలిపారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలిలోనే ఉండి బోగీలను ట్రాకుపై పునరుద్ధరించే పనులను పర్యవేక్షిస్తున్నారని ఆయన వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News