Wednesday, October 23, 2024

బెంగళూరులో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం

- Advertisement -
- Advertisement -

నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి మంగళవారం నిర్మాణంలో ఉన్న ఒక భవనం కూలిపోయి ముగ్గురు కార్మికులు మరణించగా, ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మరో 12 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. బెంగళూరులోని హనూరు ప్రాంతానికి చెందిన బాబుసపల్యలో ఈ ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖకు చెందిన సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకున్న సహాయక చర్యలను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నగరంలో భారీ వర్షం కురుస్తున్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను వెలికితీయడం ఇబ్బందిగా మారినట్లు అధికారులు చెప్పారు. ఇతర ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుని సహాయక చర్యలు నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. నిర్మాణంలో ఉన్న భవనం పూర్తిగా కూలిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News