Wednesday, October 23, 2024

అల్లు అర్జున్ పిటిషన్‌పై నేడు విచారణ

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్యాష్ చేయాలని బన్ని పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.2024, మే 11న నంద్యాలలో అప్పటి వైసిపి ఎంఎల్‌ఎ శిల్పా రవి చంద్ర తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

అయితే ఆ కార్యక్రమానికి ప్రజలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఆ సమయంలో శిల్పారవి కానీ, అల్లు అర్జున్ తరపున కాని ముందస్తు అనుమతి తీసుకోలేదు. దీంతో స్థానిక విఆర్‌ఓ సీరియస్ అయ్యారు.అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అల్లు అర్జున్‌తోపాటు శిల్పా రవిపై సెక్షన్ 144, పోలీస్ యాక్ట 30 అమలును ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఎపి హైకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News