Wednesday, October 23, 2024

‘పుష్ప-2 ది రూల్‌’ విడుదల తేదీలో  మార్పు!

- Advertisement -
- Advertisement -

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప-2’ ది రూల్‌. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ను సంపాందించుకున్న ఈ చిత్రం గురించి సినీ ప్రేమికులు ఆతురతతో ఎదురుచూస్తున్నారు. ఇదే కలయిలో తెరకెక్కిన ‘పుష్ప ది రైజ్‌’ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని నమోదు చేసుకోవడమే ఈ క్రేజ్‌కు కారణం. ఈ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న ‘పుష్ప-2’ పై అంచనాలు కూడా బాగానే వున్నాయి.

ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు కూడా శరవేగంతో కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు, టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం ఈ సినిమాకు వన్‌ఆఫ్‌ ది హైలైట్‌గా నిలుస్తుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మొదటగా నిర్మాతలు ఈ చిత్రాన్ని డిసెంబరు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు చిత్రాన్ని ఒకరోజు ముందుగా అంటే డిసెంబరు 5న ఇండియాలో, డిసెంబరు 4న ఓవర్సీస్‌లో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. డిసెంబరు 5 అర్థరాత్రి నుంచి ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఈ చిత్రం ప్రీమియర్స్‌

ను ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. ఇక రేపు అనగా అక్టోబర్‌ 24న హైదరాబాద్‌లో జరిగే పుష్ప-2 ప్రెస్‌మీట్‌లో నిర్మాతలు ఈ విషయంపై క్లారిటి ఇస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు.  పుష్ప-2 చిత్రం 1000 కోట్లకు పైగా ప్రిరిలీజ్‌ బిజినెస్‌ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రష్మిక మందన్నా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌, అజయ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News