Thursday, October 24, 2024

కొండా సురేఖ నా పరువు తీసింది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో తన పరువు, ప్రతిష్టలకు భం గం వాటిల్లిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నాంపల్లి కోర్టు కు తెలిపారు. కొండా సురేఖపై పరువునష్టం దావా కేసులో ఆయన నాం పల్లి ప్రత్యేక కోర్టుకు బుధవారం హా జరయ్యారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ పై క్రమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును ఈ సందర్బంగా కెటిఆర్ అభ్యర్థించారు. కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని, వివరంగా ఆమె అన్న మాటలు చెప్పమంటే చెబుతానని కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. సమంత, నాగచైతన్య తన వల్లే విడిపోయారని తీవ్ర ఆరోపణలు చేశారని వెల్లడించారు.

కొండా సురేఖపై పరువు నష్టం దావాకు సంబంధించి నాంపల్లి ప్రత్యేక కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ ఏం వ్యాఖ్యలు చేశారని కోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఫిర్యాదులో అన్ని విషయాలు ఉన్నాయని కెటిఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడిం చారు. దానినే ప్రామాణికంగా తీసుకోమం టారా? లేక మళ్లీ స్టేట్‌మెంట్ ఇస్తారా? అని కోర్టు ప్రశ్నించింది. అయితే మహిళ పట్ల తనకున్న గౌరవం కారణంగా సాటి మహిళ (నటి)పై కొండా సురేఖ సాటి చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తిరిగి చెప్పలేనని కెటిఆర్ అన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్ని మాత్రం రాతపూర్వకంగా కోర్టుకు అందిస్తున్నట్లు చెప్పారు. కుట్రపూరితంగా కొండా సురేఖ తనపై అసత్యపూరిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయన్నారు. వివరంగా చెప్పడానికి సిద్ధమేనన్నారు. ఈ సందర్భంగా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారంటూ కొన్నింటిని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేశానని, తాను డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు నిర్వహిస్తానని ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం పబ్లిసిటీ కోసమే కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారన్నారు. తన వల్లే కొన్ని పెళ్లిళ్లు బ్రేక్ అయినట్లుగా కూడా వ్యాఖ్యలు చేశారన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు చదవాలంటేనే ఇబ్బందికరంగా ఉందని కోర్టుకు వెల్లడించారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి అత్యంత దిగజారుడు వ్యాఖ్యలను కొండా సురేఖ చేశారని కెటిఆర్ తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఫిర్యా దులోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. నోటితో అన్నీ చెప్పలేని విధంగా ఉన్నాయన్నారు. బాధ్యత గల పదవిలో ఉండి తన పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారన్నారు. సాక్షులు దాసోజు శ్రవణ్, ఎంఎల్‌సి సత్యవతి రాథోడ్, బాల్క సుమన్, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి తనకు పద్దెనిమిదేళ్లుగా తెలుసునని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను టివిలో చూసి వాళ్లు తనకు ఫోన్ చేసి చెప్పారని కోర్టుకు వెల్లడించారు.

వారు కూడా ఈ వ్యాఖ్యలు విని బాధపడ్డారని చెప్పారు. కొండా సురేఖ వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని, వాటిని విని షాక్‌కు గురయ్యానని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సురేఖ వ్యాఖ్యలతో తన పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయన్నారు. తనతో పాటు బిఆర్‌ఎస్ పార్టీకి నష్టం చేయాలని ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. కోర్టు దాదాపు అరగంట పాటు కెటిఆర్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. కొండా సురేఖ చేసిన కామెంట్ల వీడియోలను ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు. కేటీఆర్ తో పాటు సాక్షిగా ఉన్న దాసోజు శ్రవణ్ స్టేట్ మెంట్ ను కూడా కోర్టు నమోదు చేసుకుంది. మిగతా సాక్షుల స్టేట్ మెంట్లను రికార్డ్ ను కోర్టు ఈ నెల 30 కి వాయిదా వేసింది.కొండా సురేఖ చేసిన కామెంట్ల వీడియోలను ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు. కేటీఆర్ తో పాటు సాక్షిగా ఉన్న దాసోజు శ్రవణ్ స్టేట్ మెంట్ ను కూడా కోర్టు నమోదు చేసుకుంది. మిగతా సాక్షుల స్టేట్ మెంట్లను రికార్డ్ ను కోర్టు ఈ నెల 30 కి వాయిదా వేసింది.కొండా సురేఖ చేసిన కామెంట్ల వీడియోలను ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు.

కేటీఆర్ తో పాటు సాక్షిగా ఉన్న దాసోజు శ్రవణ్ స్టేట్ మెంట్ ను కూడా కోర్టు నమోదు చేసుకుంది. మిగతా సాక్షుల స్టేట్ మెంట్లను రికార్డ్ ను కోర్టు ఈ నెల 30 కి వాయిదా వేసింది.కొండా సురేఖ చేసిన కామెంట్ల వీడియోలను ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు. కేటీఆర్ తో పాటు సాక్షిగా ఉన్న దాసోజు శ్రవణ్ స్టేట్ మెంట్ ను కూడా కోర్టు నమోదు చేసుకుంది. మిగతా సాక్షుల స్టేట్ మెంట్లను రికార్డ్ ను కోర్టు ఈ నెల 30 కి వాయిదా వేసింది.కొండా సురేఖ చేసిన కామెంట్ల వీడియోలను ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు. కేటీఆర్ తో పాటు సాక్షిగా ఉన్న దాసోజు శ్రవణ్ స్టేట్ మెంట్ ను కూడా కోర్టు నమోదు చేసుకుంది. మిగతా సాక్షుల స్టేట్ మెంట్లను రికార్డ్ ను కోర్టు ఈ నెల 30 కి వాయిదా వేసింది.కొండా సురేఖ చేసిన కామెంట్ల వీడియోలను ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు. కేటీఆర్ తో పాటు సాక్షిగా ఉన్న దాసోజు శ్రవణ్ స్టేట్ మెంట్ ను కూడా కోర్టు నమోదు చేసుకుంది. మిగతా సాక్షుల స్టేట్ మెంట్లను రికార్డ్ ను కోర్టు ఈ నెల 30 కి వాయిదా వేసింది.కొండా సురేఖ చేసిన కామెంట్ల వీడియోలను ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు.

కేటీఆర్ తో పాటు సాక్షిగా ఉన్న దాసోజు శ్రవణ్ స్టేట్ మెంట్ ను కూడా కోర్టు నమోదు చేసుకుంది. మిగతా సాక్షుల స్టేట్ మెంట్లను రికార్డ్ ను కోర్టు ఈ నెల 30 కి వాయిదా వేసింది. కొండా సురేఖ చేసిన కామెంట్ల వీడియోలను ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు. కెటిఆర్‌తో పాటు సాక్షిగా ఉన్న దాసోజు శ్రవణ్ స్టేట్ మెంట్ ను కూడా కోర్టు నమోదు చేసుకుంది. మిగతా సాక్షుల స్టేట్ మెంట్లను రికార్డ్‌ను కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. కెటిఆర్ తన వాంగ్మూలంలో తాను అమెరికాలో ఆరేళ్లు విద్యాభ్యాసం చేశానని, చదువు పూర్తయిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చానని అప్పుడే తెలంగాణ ఉద్యమం జరుగుతుందని, తెలంగాణ ఉద్యమంలో భాగంగా తిరిగి అమెరికా వెళ్లలేదని తెలిపారు. 2006 ఆగస్టులో కెసిఆర్ కరీంనగర్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారని, దీనితో మళ్లీ ఉప ఎన్నికలు వచ్చాయని ఇక 2006 నుంచి 2009వరకు తాను తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేశానని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేశానని, 2009లో సిరిసిల్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచానని,

ఐదుసార్లు తాను అసెంబ్లీకి ఎమ్మెల్యేగా గెలిచానని కెటిఆర్ పేర్కొన్నారు. తాను మంత్రిగా పని చేశానని, 2014 నుండి 2023 వరకు మంత్రిగా ఉన్నానని పేర్కొన్న కెటిఆర్ 2018 లో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యానని వెల్లడించారు. గతంలోనూ కెటిఆర్‌పై కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అప్పుడు ఎన్నికల సంఘం ఆమె తీరుపై మండిపడింది. అయినప్పటికీ కొండా సురేఖ తీరులో ఎలాంటి మార్పు రాలేదు. మళ్లీ అవే ఆరోపణలు చేయటంతో బేషరతుగా క్షమాపణ చెప్పాలని కెటిఆర్ ఆమెకు లీగల్ నోటీసులు ఇచ్చారు. మంత్రి నుంచి ఎలాంటి సమాధానం రాకపోటవంతో కొండా సురేఖ పై పరువు నష్టం దావా కేసును కెటిఆర్ దాఖలు చేశారు. ఈ నెల 21నే స్టేట్ మెంట్ రికార్డ్ చేయాల్సి ఉన్నప్పటికీ కెటిఆర్ అభ్యర్థన మేరకు గురువారం వరకు కోర్టు సమయమిచ్చింది. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తెలంగాణ భవన్ నుంచి కెటిఆర్ సహా ఈ కేసులో సాక్షులుగా ఉన్న దాసోజు శ్రవణ్, ఎంఎల్‌సి సత్యవతి రాథోడ్, బాల్క సమన్, మాజీ మంత్రి జగదీష్ తో పాటు బిఆర్‌ఎస్ నేతలు నాంపల్లి కోర్టుకు బయలుదేరారు. కెటిఆర్, దాసోజు శ్రవణ్‌ల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News