Friday, October 25, 2024

విరాట్, గిల్, జైస్వాల్ ఔట్… 72/4

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 27 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 72 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శుభ్‌మన్ గిల్ 30 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. శాంట్నర్ బౌలింగ్‌లోనే విరాట్ కోహ్లీ కూడా క్లీన్ బౌల్డయ్యాడు. యశస్వి జైస్వాల్ 30 పరుగులు చేసి గ్లెన్ ఫిలీప్స్ బౌలింగ్‌లో డారీ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్(10), సర్ఫరాజ్ ఖాన్(01) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 259 పరుగులు చేసి ఆలౌటైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News