Saturday, October 26, 2024

దక్షిణాది దండెత్తాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్ర భుత్వం చిన్నచూపు చూస్తోందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించా రు. దక్షిణాది రాష్ట్రాలకు ఐక్యత అవసరమని సిఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. సంపద సృష్టించేది దక్షిణాది రాష్ట్రాలని, తమ సొ మ్మును అనుభవించేది ఉత్తరాది రాష్ట్రాలని ఆయన ఆరోపించారు. సౌత్ రాష్ట్రాలకు మోడీ అందించిన సహకారం చాలా తక్కువ సిఎం పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన డీలిమినేషన్ చే యడం అన్యాయమని సిఎం రేవంత్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం పెద్దగా నిధులు ఇవ్వకపోయినా ఇక్కడి ఓట్లు కావాలని ఎలా అడుగుతారని రేవంత్ ప్రశ్నించారు. నార్త్‌తో పోలిస్తే సౌత్ స్టేట్స్ ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నా వాటిలో తిరిగి పొందేది మా త్రం చాలా తక్కువ వాటా ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్ వేదికగా ఏబిపి నెట్‌వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్’ను సిఎం రేవంమత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సం దర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ కేంద్రానికి తాము ఒక్క రూ పాయి పంపిస్తే తిరిగి వెనక్కి వస్తుంది కేవలం రూ.40 పైసలు మా త్రమేనన్నారు. అదే యూపి నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి వెళితే రూ.7లు, బీహార్‌కు రూ.6లు వెనక్కి వస్తున్నాయన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను దక్షిణాది రాష్ట్రాలు ఆహ్వానిస్తున్నా నిధుల విషయంలో మాత్రం వివక్ష జరుగుతూనే ఉందని ఆయన విమర్శించారు. దేశ జనాభాను దృష్టిలో ఉంచుకొని అప్ప ట్లో కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు పాటించాయన్నా రు. కు.ని. పాటించని ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పుడు లబ్ధి పొందుతున్నాయని రేవంత్ ఆరోపించారు. దేశ జీడిపిలో దక్షిణాది రాష్ట్రాల వాటా 30 శాతం కాగా, జనాభా 16 శాతం అని జనాభా ప్రాతిపదికన కాకుండా పన్నుల వాటాగా నిధులు కేటాయించాలని సి ఎం డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్ర ఐక్యత పోరాటాలు కొనసా గాలని, దక్షిణాది రాష్ట్రాలు ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయని ఆ యన తెలిపారు. రాజకీయ కారణాల వల్ల కర్ణాటక సిఎం సిద్ధరామయ్య నాయకత్వం వహించలేకపోయారని,ఎన్డీఏతో పొత్తు వల్ల చంద్రబాబు ముందుకు రావడం లేదని, అవసరమైతే తానే నాయకత్వం వహిస్తానని సిఎం రేవంత్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల ఐక్యత, అభివృద్ధికి కోసం పోరాడుతామని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ ఉత్తర భారత దేశానికి చెందిన వ్యక్తి కావడంతోనే ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.

బాపూఘాట్ లో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం
ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూఘాట్‌ను అభివృద్ధి చేయబోతు న్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈసా, మూసా నదులు కలిసే చోట బాపూఘాట్ ఉందని, అక్కడ గుజరాత్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహం మాదిరిగా బాపూఘాట్ లో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్ చెప్పారు. మూసీ పునరుజ్జీవాన్ని చేసి గాంధీ వారసులుగా తాము బాపూఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామంటే దీనిని బిఆర్‌ఎస్, బిజెపిలు ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నాయని ఆయన ప్రశ్నించారు.

మీరు గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకోవచ్చని, కానీ, తాము మూసీ పునరుజ్జీవం చేస్తామంటే బిజెపి నేతలు ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. తాము గుజరాత్‌కు పోటీ ఇవ్వబోతున్నామని తెలిసే తెలంగాణను, హైదరాబాద్‌ను ఫినిష్ చేయాలని బిజెపి నేతలు మ ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటున్నారని సిఎం రేవంత్ ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్‌రోడ్డు, రేడియల్ రాడార్, ఇరిగేషన్ ప్రాజెక్టులతో తెలంగాణ పురోగతి సాధించి గుజరాత్‌కు పోటీ ఇస్తుందన్న విషయం తెలిసే తమ ప్రయత్నాలను ఆపేందుకు బిజెపి, బిఆర్‌ఎస్‌లు కుట్రలు పన్నుతున్నాయన్నారు. బిఆర్‌ఎస్ వ్యతిరేకించిన మరుసటి రోజే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడతారని ఆయన ధ్వజమెత్తారు. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తే సమస్య ఏమీటని రేవంత్ రెడ్డి నిలదీశారు.

ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే మాకు మద్ధతిచ్చారు
పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపించిన గత సిఎం కెసిఆర్ పది సార్లు కూడా సెక్రటేరియట్‌కు రాలేదని ప్రతిపక్ష హోదా ఇస్తే పది నిమిషాలు గవర్నర్ స్పీచ్ విని వెళ్లిపోయారని సిఎం రేవంత్ ధ్వజమెత్తారు. కెసిఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే ఎందుకు బయటకు రావడం లేదని సిఎం రేవంత్ ప్రశ్నించారు. కెసిఆర్ జమీందార్ అని భావిస్తున్నారని అందుకే బయటకు రావడం లేదని సిఎం విమర్శించారు. ప్రజలు ఎన్నుకుంటే తాము అధికారంలోకి వచ్చామని మీకు నచ్చకుంటే ఇంట్లో కూర్చోవాలని, తమ ప్రభుత్వాన్ని పని చేయనివ్వాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని చూస్తే ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కెసిఆర్ ప్రజల ఆలోచనను అర్థం చేసుకోవాలన్నారు. ప్రజల ఆలోచనను పట్టించుకోకుంటే వచ్చే ఎన్నికల్లో బిజెపి, బిఆర్‌ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకున్నారని దాంతో బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే తనకు మద్దతుగా నిలిచారని సిఎం రేవంత్ తెలిపారు.

మోడీ ఏ రెవల్యూషన్ తెచ్చారు?
నెహ్రూ నుంచి మొదలుకొని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నర్సింహారావు, మన్మోహన్ సింగ్ వంటి అనేక మంది కాంగ్రెస్ ప్రధానులు ఈ దేశంలో అనేక సంస్కరణలు, విప్లవాలు తీసుకువచ్చారని సిఎం రేవంత్ తెలిపారు. మూడో సారి ప్రధాని అయిన నరేంద్రమోడీ ఈ దేశ ప్రజల కోసం ఏ రెవల్యూషన్ తీసుకువచ్చారని సిఎం రేవంత్ ప్రశ్నించారు. పార్టీలను చీల్చడం, భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం తప్ప మీరు చేసిందేంటని ముఖ్యమంత్రి నిలదీశారు. ఈ దేశంలో ఉత్తర, దక్షిణ భారత దేశం అనే విభజన తేవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా నార్త్ వ్యక్తి ప్రధానిగా ఉండే సౌత్ వ్యక్తి రాష్ట్రపతిగా ఉండటం ఆనవాయితీగా ఉండేదన్నారు. కానీ, ఆ నియమాన్ని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News