Saturday, October 26, 2024

తిరుమల శ్రీవారి దర్శనానికి 5 గంటల సమయం..

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. రెండు మూడు రోజులుగా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే, శనివారం మళ్లీ భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

టోకెన్ లేని భక్తులకు స్వామి వారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఇక, శుక్రవారం శ్రీవారిని 56,501 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి 21,203 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News