Sunday, October 27, 2024

స్కిల్ వర్శిటీకి మేఘా చేయూత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అ త్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ముందుకొచ్చింది. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ ని ర్మాణానికి మేఘా కంపెనీ తమ కార్పొరేట్ సో షల్ రెస్పాన్సిబులిటీ నిధుల నుంచి రూ.200 కో ట్లు కేటాయించింది. వీటితో యూనివర్సిటీ క్యాంపస్‌లో అవసరమైన భవనాలను నిర్మించే బాధ్యతలను స్వీకరించింది. ప్రపంచ స్థాయి అ ధునాతన నమూనాలతో అన్ని మౌలిక వసతులు ఉండేలా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణం చేపట్టేందుకు కంపెనీ ముందుకు వచ్చింది. శనివారం సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో మేఘా కంపెనీ ఎండి కృష్ణారెడ్డి నేతృత్వం లో ఆ కంపెనీ ప్రతినిధుల బృందం సంప్రదింపు లు జరిపింది. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వెంకట్‌రెడ్డి, పొంగులేటి, శ్రీనివాస్ రెడ్డి, ఎంపి అనిల్ కుమార్ యాదవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వారం రోజుల్లోగా భవన డిజైన్‌లకు తుది రూపు ఇవ్వాలి
ప్రభుత్వం తలపెట్టిన స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకునేందుకు మెఘా కంపెనీ చర్చలు జరిపింది. ప్రపంచస్థాయి ప్ర మాణాలతో స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ ని ర్మాణం చేపడుతామని మెఘా ప్రకటించింది. యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చే సుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జ యేష్ రంజన్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విఎల్వీఎస్‌ఎస్ సుబ్బారావు సమక్షంలో ఎంఓయూ పై సంతకాలు చేశారు. హైదరాబాద్ శివార్లలోని కందుకూరు మండలంలో మీర్‌ఖాన్ పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆగష్టులోనే యూనివర్సిటీ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

అక్కడ అధునాతన బోధన సదుపాయాలతో పాటు విద్యార్థులకు అన్ని వసతులుండేలా క్యాంపస్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిఎస్‌ఆర్ నిధులతో ఈ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. అకాడమిక్ బిల్డింగ్, వర్క్‌షాపులు, తరగతి గదులతో పాటు హాస్టల్ బిల్డింగ్ నిర్మిస్తామని మెఘా కంపెనీ ఎండి కృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్ నిపుణులతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్‌లను ఈ సమావేశంలో ప్రదర్శించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్‌లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. నవంబర్ 8వ తేదీ నుంచి యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన చెప్పారు. ప్రభుత్వం తరఫున అందుకు అవసరమైన సహకారం అందిస్తామని సిఎం భరోసా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News