Sunday, April 13, 2025

కాకినాడలో కత్తులతో దాడి…. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా కాజులూరు మండలం శలపాకలో రెండో వర్గాలు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘర్షణలో పలువురు గాయపడినట్టు సమాచారం. కాకినాడ ఎస్‌పి విక్రాంత్ పాటిల్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి ఇరువర్గాలను చెదరగొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పాత కక్షల నేపథ్యంలో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయని పోలీసులు వెల్లడించారు. మృతులు బత్తుల చిన్ని, బత్తుల రమేశ్,  బత్తుల రాజుగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News