Sunday, February 16, 2025

శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖైరతాబాద్‌లోని శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎల్లారెడ్డిగూడెంలో హై టెన్షన్ కరెంటు వైర్లు ప్రభుత్వ స్కూల్‌పై తెగిపడ్డాయి. వైర్లు పడిన స్థలంలో విద్యార్థులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో జనవాసాల మధ్య నుంచి 34 కెవి హై టెన్షన్ లైన్ తొలగించాలని స్థానికులు ధర్నాకు దిగారు. శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు స్థానికులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. సోమాజిగూడ కాంగ్రెస్ కార్పొరేటర్ స్థానికులతో కలిసి ఆందోళనకు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News